Monday, September 17, 2012

M.S.సుబ్బులక్ష్మిగారి జయంతి.












జన్మ నామం మధురై షణ్ముఖవడివు సుబ్బు లక్ష్మి
జననం సెప్టెంబర్ 16, 1916
మదురై,తమిళనాడు రాష్ట్రం
మరణం డిసెంబర్ 11, 2004
చెన్నై, తమిళనాడు రాష్ట్రం
ఊపిరితిత్తుల న్యుమోనియా,
హృదయ సంబంధ సమస్యలతో[1]
నివాసం చెన్నై, తమిళనాడు
వృత్తి కర్నాటక సంగీత గాయకురాలు/నాయకురాలు
మరియు
నటి
మతం హిందూ
భార్య/భర్త త్యాగరాజన్ సదాశివన్
సంతానం లేరు
తండ్రి సుబ్రహ్మణ్య అయ్యర్
తల్లి షణ్ముఖవడివు అమ్మల్


సంతకము



ఆమె పాడకపోతే దేవుళ్ళక్కూడా తెల్లవారదు!?
ఆమె పాట వినబడకపోతే దేశమే తానైన ఏ పల్లే లేవదు !?
తన సుప్రభాత గీతంతో భగవంతుణ్ణి నిదురలేపే ఆ సంగీత ఆధ్యాత్మిక స్వరం ఆమెకు ఒక వరం.
" కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవ మాహ్నికమ్ .....
.....అంటూ సాగే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం తెలుగువాడి గుండెల్లో భక్తిభావాల్ని కలిగిస్తుంది. ఆమె పాటలు వింటుంటే మనసు ప్రశాంతంగా, హాయిగా వుంటుంది. అభిమానులు ప్రేమగా ఎం.ఎస్ అని పిలిచుకొనే
మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి
దేశములో మొట్ట మొదటి సారిగా భారతరత్న[2] పురస్కారం అందుకున్న గాయకురాలుగా చరిత్ర సృష్టించి ఎందరికో స్ఫూర్తినిచ్చి చరిత్రలో తన గానంతో అజరామరురాలు అయ్యారు.ప్రపంచం లో ఎవరైనా ఒకవేళ భారతీయుల సాంప్రదాయ వస్త్రధారణ ఎలా వుంటుందని అడిగితే ఒక్క మాటలో చెప్పగలిగే సమాధానమే ఎమ్మెస్. నేను 'ఎమ్మెస్ సుబ్బ లక్ష్మి'కి సమకాలీకుడనని చెబితే యముడు 'నువ్వు సకల స్తోత్రాలూ,మంత్రాలూ,కవచాలూ,సుప్రభాతాలూ..,అన్నీ వినే వుంటావు.ఇక నీకిక్కడ పని ఏమిటి స్వర్గానికి పో అంటాడు.మాతాతయ్య గాంధీని చూసానని చెప్పేవారు.నేను నా మనుమలకు ఎమ్మెస్ ని చూసానని గొప్పగా చెప్పుకొంటాను.పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారి 'నాహం కర్తాః-హరిః కర్తాః'అనే పుస్తకం చదివితే,ఆమెపై గౌరవం మరింత పెరుగుతుంది.

బాల్యము::

తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య అయ్యర్ , ప్రముఖ వీణావాద్య విద్యాంసురాలు షణ్ముఖవడివు అమ్మల్ కు 1916 సెప్టెంబర్ 16 న జన్మించింది. తల్లి ఆమె ఆది గురువు. పదేళ్ళ ప్రాయం నుంచే సంగీత ప్రస్థానం ప్రారంభమైంది. అయితే ఆమెలో భక్తితత్వానికి బీజం వేసింది మాత్రం ఆమె తండ్రి అయ్యర్. సుబ్బలక్ష్మి శుద్ధ సంప్రదాయ కుటుంబంలో జన్మించింది కనుక తన జీవితకాలమంతా ఆమె భారతీయ సంప్రదాయాన్ని, సంస్కారాన్ని అమితంగా ప్రేమించింది. బాల్యంలో పాఠశాలలో అకారణంగా టీచరు కొట్టడంతో చిన్నతనంలోనే బడికి వెళ్ళడం మానేసిన సుబ్బలక్ష్మి తన అక్క, అన్నదమ్ములతో కలసి సంగీత సాధన చేసి, సెమ్మంగుడి శ్రీనివాస్ అయ్యర్ వద్ద సంగీతంలో శిక్షణ పొంది తన ప్రతిభకు స్పష్టమైన రూపునిచ్చి, తదనంతర కాలంలో జాతి గర్వించతగ్గ అంతర్జాతీయ సంగీత సామ్రాజ్ఙిగా ఎదిగింది. 1926 లో 10 సంవత్సరాల వయసులో గుడిలో పాటలు పాడడంతో తన తొలి సంగీత ప్రదర్శన మొదలైంది. నాటి నుండి సంగీత ప్రియులను తన మధుర స్వరంతో సంగీతంలో ఓలలాడిస్తూనే ఉంది. అప్పుడే తను మొట్టమొదటిసారిగా హెచ్.ఎం.వి. కోసం 'ఆల్బమ్ ' అందించింది

జీవితం::

సుబ్బలక్ష్మిలోని ప్రతిభను గుర్తించిన తల్లి మధురై నుంచి చెన్నై కి మకాం మార్చటంతో ఆమె జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది. ఆమె 1933 లో మద్రాస్ సంగీత అకాడెమీలో తన మొట్ట మొదటి సంగీత కచేరీకి శ్రీకారం చుట్టింది. సంగీతపరంగా సుబ్బలక్ష్మి జీవితంలో ఇది ఒక మలుపైతే తన గురువు, మార్గదర్శి, ఆనంద వికటన్ పత్రిక సీనియర్ ఎగ్జిక్యూటివ్ , స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది అయిన త్యాగరాజన్ సదాశివన్ తో 1940 లో ఆమె ప్రేమవివాహం మరో ముఖ్యమైన మలుపు. 1938 సంవత్సరంలో సేవాసదనం సినిమా ద్వారా సుబ్బలక్ష్మి సినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టింది. సదాశివన్ సినీ నిర్మాత కూడ కావడంతో సుబ్బలక్ష్మి సినీ సంగీత జీవితానికి ఎటువంటి అడ్డంకులు ఎదురు కాలేదు. తమిళ సినిమాలలో గాయనిగా తెరపై కూడా కనిపించి ప్రేక్షకులను అలరించింది. 1940 వ సంవత్సరంలో శకుంతలై అన్న తమిళ సినిమాలో ఆమె తొలిసారిగా గాయక నటిగా తెరపై కనిపించింది. 1945 వ సంవత్సరంలో నిర్మించబడిన 'మీరా' చిత్రం హిందీలో పునర్నిర్మించబడి కూడా విజయవంతం కావడంతో సుబ్బలక్ష్మి పేరు భారతదేశమంతటికీ సుపరిచితమయింది. 'మీరా' సినిమాలోని ఆమె నటనకు, గాన మాధుర్యానికి జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి. అది ఆమె ఆఖరి సినిమా. భక్తిగాయనిగా సుబ్బలక్ష్మి పేరు ప్రఖ్యాతులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంలో సదాశివన్ కృషి ఎంతో వుంది.
ఎం.ఎస్.సుబ్బలక్ష్మి గురించి వీడియో, అడియో పరిచయం యూట్యూబ్.లింక్[3]




ఆమె గాత్రం, సోత్రం, గానం, గీతం::::

సుబ్బలక్ష్మి పాడుతుంటే స్వయంగా అమ్మవారే పాడుతున్నట్లు భావించేవారు. నిండైన విగ్రహం, భారతీయతకు ప్రతీకగా ఒంటినిండా పట్టుచీర, నుదుటి మీద ఎర్రటి కుంకుమబొట్టు, చేతుల నిండా గాజులు, కళ్లకు నిండుగా కాటుక, కొప్పు, కొప్పు నిండా మల్లెపూలు, చేతిలో తంబూర పట్టుకొని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానలహరిలో మునిగిపోయేవారు. కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. గానం ధ్యానంలా సాగేది. పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలును, శాస్త్రీయ, లలిత గీతాలను, భజనలు, జానపద గేయాలు, మరాఠీలో అభ్యాంగ్స్, దేశభక్తి గేయాలు కూడా పాడారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బలక్ష్మి ప్రత్యేకత. శృతి, లయ, ఆలపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాళ్ళలో వ్యక్తీకరించడంతోపాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యం! ముఖ్యంగా సంక్లిష్ట సమాసాలతో కూడిన సంస్కృత భాషలోని భావం దెబ్బతినకుండా అలవోకగా ఆలపించడం ఆమె సాధన ద్వారా సాధించుకున్న గొప్ప వరం. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు సుబ్బలక్ష్మి తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు.
మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన ' వైష్ణవ జనతో....' జె పీర్ పరాయీ జానేరే......' వంటి గీతాలకు ప్రాణం పోసిన వ్యక్తి ఆమె. అమె కంఠం అత్యంత మధురం. భజనపాడుతూ అందులొనే అమె పరవశురాలవుతారు. ప్రార్ధన సమయములొ ఎవరయిన అలా లీనమవాలి. ఓ భజనను మొక్కుబడిగా పాడటం వేరు, అలా పాడుతూ పూర్తిగా దైవ చింతనలొ లీనవడం వేరు అని మహాత్మా గాంధీ అన్నారు అంటే, సుబ్బలక్ష్మి సంగీతములొని మాదుర్యపు ప్రభావం, సారాంశం ఏమిటో అర్థం చేసికోవచ్చు!
ఐక్య రాజ్య సమితి లో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు సుబ్బలక్ష్మి. ఆ సందర్భంలో 'న్యూయార్క్ టైమ్స్' పత్రిక సుబ్బలక్ష్మిని ప్రశంసిస్తూ తన సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలిగా పేర్కొన్నాయి. రాయల్ ఆల్బర్ట్ హాల్, లండన్ లో ప్రదర్శన యిచ్చినపుడు ఇంగ్లండ్ రాణిని కూడా తన్మయురాలిని చేసి, ప్రశంసించేలా చేసింది.





M.S.సుబ్బలక్ష్మి గారి జయంతి

స్వరరాగ గంగా ప్రవాహం
కౌసల్యా సుప్రజా రామా... అని ఆ గళం నుండి సుప్రభాతం వినకపోతే కలియుగ దైవం వెంకటేశ్వరుడికే తెల్లవారదు. ఆమె పాటలు వింటుంటే మనసు తేలికవుతుంది. తెలియకుండానే భక్తి భావం కలుగుతుంది. ఆ దివ్యమంగళ రూపం చూస్తే చాలు రెండు చేతులూ ఎత్తి నమస్కరించాలనిపిస్తుంది.
ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంట!
అవును... 'MS.అమ్మా' అని అభిమానులు ప్రేమగా పిలుచుకునే మదురై షణ్ముఖవడిపు సుబ్బలక్ష్మి. ఈ రోజు'MS . సుబ్బలక్ష్మి గారి జయంతి.



1916 సెప్టెంబర్ 16న తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో సుబ్రహ్మణ్య అయ్యర్, షణ్ముఖవడిపు అమ్మల్ దంపతులకు ఆమె జన్మించారు. చిన్నపటినుంచే సంగీతమంటే ఆసక్తి ఉండడంతో దానిలో శిక్షణ పొంది 1933 లో మద్రాస్ సంగీత అకాడమీలో మొదటి సంగీత కచేరి ఇచ్చారు. అలా మొదలైన ఆమె సంగీత ప్రస్థానం అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఐరాసలో పాడినా, బ్రిటన్ రాణిని తన గాన మాధుర్యంతో తన్మయురాలిని చేసినా అది ఆవిడకే చెల్లింది. అంతేకాదు... దేశంలోనే అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌, భారతరత్న, ఇందిరా జాతీయ సమైక్యతా అవార్డు, ఢిల్లీ ప్రభుత్వంచే జీవిత సాఫల్య పురస్కారం, రామన్‌ మెగసెసే పురస్కారం, పలు విశ్వవిద్యాలయాలచే డాక్టరేట్‌లు ఆమెను వరించాయి.
ఇలా కొన్ని దశాబ్దాలపాటు ఈ ధరణీతలాన్ని భక్తి భావనను, పవిత్ర సుమగంధాలను వెదజల్లి పులకింపజేసిన కర్నాటక శాస్త్రీయ సంగీత స్వరధార 2004 డిసెంబర్ 11న ఆగిపోయింది.
భౌతికంగా మనల్ని విడిచి వెళ్ళిపోయినా ఆమె గళం ఈ ఇలాతలంపై వినపడుతున్నంతకాలం ఆ స్వరరాగ గంగా ప్రవాహం సాగుతూనే ఉంటుంది..



ఇంటింటా పవిత్ర సుమసుగంధాలను వెదజల్లిన ' సుప్రభాత ' గీతమై ప్రతి ఇంటా ఆధ్యాత్మిక భావనలను విరజిమ్మిన విష్ణు సహస్రనామ నిత్యస్తోత్రమై ఈ ధరణీతలాన్ని కొన్ని దశాబ్దాల పాటు పులకింపచేసిన కర్ణాటక శాస్త్రీయ సంగీత స్వరధార 2004, డిసెంబర్ 11న శాశ్వతంగా మూగబోయింది.[1] కాని ఆమె గొంతు మాత్రం విశ్వం ఉన్నంత కాలం ప్రపంచం అంతా మారుమోగుతూనే ఉంటుంది.


ఈ ఆణిముత్యాలు...వీ కీ పీడియా ... ప్రణవనాదం నుండి సేకరించినవి

No comments: